కొత్త ఎంట్రీ విధానాన్ని ప్రకటించిన బహ్రెయిన్

- February 04, 2022 , by Maagulf
కొత్త ఎంట్రీ విధానాన్ని ప్రకటించిన బహ్రెయిన్

బహ్రెయిన్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు పీసీఆర్  సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కొత్త ఎంట్రీ విధానాన్ని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ అప్ డేట్ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ప్రయాణానికి ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించకుండానే బహ్రెయిన్ రావొచ్చు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ముందు జాగ్రత్తలు కొనసాగనున్నాయి. బహ్రెయిన్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు క్వారంటైన్ నిబంధులు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే విమాన ప్రయాణంలో, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక ప్రికాషన్స్ అమల్లో ఉంటాయని  సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com