సౌదీలో కొత్త ప్రయాణ ఆంక్షలు
- February 04, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 9 నుండి కొత్త ప్రయాణ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సౌదీ పౌరులందరూ ఫిబ్రవరి 9 (రాజ్బ్ 8) నుండి వేరే దేశాలకు వెళ్లాలంటే కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకొని ఉండాలి. అయితే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, తవక్కల్నా యాప్ కవర్ చేసిన నిబంధనల క్రింద మినహాయించబడిన ఇతరులకు దీనినుండి మినహాయింపునిచ్చారు. ప్రయాణానికి 48 గంటల ముందు నెగిటివ్ పీసీఆర్ సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మినహాయింపునిచ్చారు. కరోనా పాజిటివ్ గా తేలి, వ్యాక్సిన్ పొందిన సౌదీ సిటిజన్స్.. దేశంలోకి వచ్చేందుకు ఏడు రోజుల పాటు దేశం బయట ఉండవలసి ఉంటుంది. అదే సమయంలో పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు మాత్రం 10 రోజులపాటు వేచి ఉండాలి.
తాజా వార్తలు
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!









