కోవిడ్ 19: ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి
- February 05, 2022
కువైట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. మొత్తంగా 716,662 మంది కార్మికులు భారతదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో దాదాపు సగం మంది (330,058) యూఏఈ నుంచి వచ్చినవారే. సౌదీ అరేబియా (137,900), కువైట్ (97,802), ఒమన్ (72,259) ఆ తర్వాతి స్థానంలో వున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాల్ని పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు. స్వదేశానికి తిరిగి వచ్చినవారిని ఆదుకోవడంతోపాటు, కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయినవారికి తగిన సాయం అందించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







