రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

- February 05, 2022 , by Maagulf
రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

హైదరాబాద్: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. రామానుజ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. అంతకుముందు ముచ్చంతల్‌లోని యాగశాలలో ప్రధాని మోదీ ప్రధాని పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. చినజీయర్‌ స్వామి ఇచ్చిన కంకణాన్ని మోదీ ధరించారు. అనంతరం సమతామూర్తి విగ్రహ ప్రాంగనానికి మోదీ చేరుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. 108 దివ్య దేశాల విశిష్టతను చినజీయర్‌ స్వామి ప్రధానికి వివరించారు. రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com