ఏపీ కరోనా అప్డేట్
- February 06, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2వేల 690 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజే 11వేల 855 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69వేల 572 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28వేల 598 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. శనివారంతో(3,396 కేసులు) పోల్చుకుంటే ఆదివారం కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!