FIFA ప్రపంచ కప్ 2022.. సిద్ధమైన లుసైల్ స్టేడియం
- February 07, 2022
ఖతార్: FIFA ప్రపంచ కప్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ సన్నద్ధమవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చే లుసైల్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. FIFA వరల్డ్ కప్ 2022కి అర్హత సాధించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా జెండాలను ఎగురవేసే కార్యక్రమంలో ఈ మేరకు సుప్రీం కమిటీలో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఈవెంట్ ఎక్స్ పీరియన్స్ డిప్యూటీ జనరల్ మిస్టర్ ఖలీద్ అల్ మౌలావి స్పష్టం చేశారు. టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ సంసిద్ధంగా ఉందని అల్ మవ్లావి అన్నారు. ఈ సందర్భంగా FIFA 2022కి అర్హత సాధించినందుకు కొరియా,ఇరాన్లకు అభినందనలు తెలియజేశాడు. ఇప్పటి వరకు ఆతిథ్య దేశం ఖతార్తో సహా దాదాపు 15 దేశాలు FIFA ప్రపంచ కప్ 2022కి అర్హత సాధించాయి. మొదటి దశ టిక్కెట్ విక్రయం గత నెలల్లో ప్రారంభమయ్యాయి. ఈవెంట్ కోసం 1.5 మిలియన్ల మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. నవంబర్ 21–డిసెంబర్ 18 వరకు జరగనున్న ఫుట్బాల్ పోటీలు జరుగనున్నాయి. ఇంకా తేదీని నిర్ణయించనప్పటికీ, లుసైల్ స్టేడియం ప్రారంభోత్సవానికి వేదిక సిద్ధమైంది. మిగతా ఏడు స్టేడియాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







