తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

- February 07, 2022 , by Maagulf
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 68వేల 720 కరోనా పరీక్షలు చేయగా 1,380 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,78,910కి చేరింది. తాజాగా మరొకరు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,101కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.39గా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 350 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారంతో(1217) పోలిస్తే సోమవారం కరోనా కేసులు పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com