ఎక్స్ పో 2020 దుబాయ్: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ డ్రాలో విజేతలు వీరే

- February 08, 2022 , by Maagulf
ఎక్స్ పో 2020 దుబాయ్: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ డ్రాలో విజేతలు వీరే

దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్‌ ఇండియా పెవిలియన్‌లో ఎయిర్ ఇండియా ‘ఎక్స్ ప్రెస్ లక్కీ డ్రా’లో ఇద్దరు ఇండియన్స్ విజేతలుగా నిలిచారు. భారత కాన్సుల్-జనరల్ డాక్టర్ అమన్ పూరితో పాటు టాటా సన్స్ & కంపెనీల అధికారులు, GMEA ప్రాంతానికి చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారుల సమక్షంలో తీసిన డ్రా లో సలోని సచిన్ షా, సన్హా షెజ్రిన్‌లు విజేతలుగా నిలిచారు. దాంతో వీరు ఇండియాలో ఏదైనా ప్రాంతానికి ఆగస్టు 31 లోపు అమల్లో ఉండే ఉచిత రౌండ్-ట్రిప్ టిక్కెట్‌లను పొందారు. ఇటీవల ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ప్రయాణించిన వారు తమ బోర్డింగ్ పాస్‌లను ఇండియా పెవిలియన్ వద్ద ఉన్న ఎయిర్ ఇండియా కియోస్క్ లో చూపడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com