భారత్ కొత్త గైడ్లైన్స్: క్వారంటైన్ పై కీలక నిర్ణయం
- February 10, 2022
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్ను పక్కన పెట్టింది.అంతే కాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో రెండు వారాల ట్రావెల్ హిస్టరీ గురించి డీటెయిల్గా వివరించాల్సి ఉంటుంది.
ఇక, భారత్ వచ్చిన తరువాత రెండు వారాల పాటు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ప్రయాణం చేయడానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా ఆన్లైన్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనల విషయంలో కీలక మార్పులు చేసింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







