భారత్ కరోనా అప్డేట్

- February 12, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది.

అటు దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,10,443గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,36,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,14,68,120కి చేరింది. గడిచిన 24 గంటల్లో 46,82,662 మందికి కరోనా వ్యాక్సిన్‌లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 డోసుల కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా డైలీ కరోనా పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com