2,754 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
- February 13, 2022కువైట్: ఐరోపా దేశం నుంచి విదేశీ లిక్కర్ ని దిగుమతి చేసుకుంటున్న ఐదుగురు నిందితులను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. వారి వద్ద ఉన్న 2,754 లిక్కర్ బాటిళ్లు, కిలో హషీష్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూరోపియన్ దేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న లిక్కర్ ను తీసుకురావడానికి ఒక సిటిజన్ ప్రయత్నించగా.. సమాచారం అందుకున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతడిచ్చిన సమాచారం మేరకు అమ్ఘరా ప్రాంతంలోని గోదాములో దాచిన సుమారు 2,754 దిగుమతి చేసుకున్న లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా లిక్కర్ అక్రమ రవాణాలో భాగమైన మిగతా ముఠా సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అరబ్ జాతీయలు కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 200 వేల దినార్లుగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..