2,754 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
- February 13, 2022
కువైట్: ఐరోపా దేశం నుంచి విదేశీ లిక్కర్ ని దిగుమతి చేసుకుంటున్న ఐదుగురు నిందితులను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. వారి వద్ద ఉన్న 2,754 లిక్కర్ బాటిళ్లు, కిలో హషీష్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూరోపియన్ దేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న లిక్కర్ ను తీసుకురావడానికి ఒక సిటిజన్ ప్రయత్నించగా.. సమాచారం అందుకున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతడిచ్చిన సమాచారం మేరకు అమ్ఘరా ప్రాంతంలోని గోదాములో దాచిన సుమారు 2,754 దిగుమతి చేసుకున్న లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా లిక్కర్ అక్రమ రవాణాలో భాగమైన మిగతా ముఠా సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అరబ్ జాతీయలు కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 200 వేల దినార్లుగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









