2,754 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
- February 13, 2022
కువైట్: ఐరోపా దేశం నుంచి విదేశీ లిక్కర్ ని దిగుమతి చేసుకుంటున్న ఐదుగురు నిందితులను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. వారి వద్ద ఉన్న 2,754 లిక్కర్ బాటిళ్లు, కిలో హషీష్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూరోపియన్ దేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న లిక్కర్ ను తీసుకురావడానికి ఒక సిటిజన్ ప్రయత్నించగా.. సమాచారం అందుకున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతడిచ్చిన సమాచారం మేరకు అమ్ఘరా ప్రాంతంలోని గోదాములో దాచిన సుమారు 2,754 దిగుమతి చేసుకున్న లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా లిక్కర్ అక్రమ రవాణాలో భాగమైన మిగతా ముఠా సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అరబ్ జాతీయలు కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 200 వేల దినార్లుగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







