జల సంరక్షణకు సరికొత్త ఆలోచన
- March 30, 2016
నేటి రోజుల్లో నీటిని తీసుకురావడమే కాదు.. నీటి వృథాను అరికట్టడం కూడా భగీరథ ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నమే ఓ పాఠశాల అద్భుతంగా చేస్తోంది. ఓ కొత్త ఆలోచన.. ఓ చిరు ప్రయత్నం.. చక్కటి క్రమ శిక్షణ.. వెరశి నిత్యం వేలాది లీటర్ల నీటిని ఆదా చేస్తున్నాయి. ఇది చదివిన ఎవరైనా అరే మనం ఇలా ఎందుకు ఆలోచించలేకపోయాం అనుకోవాల్సిందే.. ఒక్క పాఠశాలలోనే ఇంత జరుగుతుంటే.. దీనిని అన్ని పాఠశాలల్లో ఆచరిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉండదూ?పుణెలోని పింప్రీ ప్రాంతంలో సిటీ ప్రైడ్ పాఠశాల యాజమాన్యం జల సంరక్షణకు సరికొత్త ఆలోచన చేసింది.పిల్లలు పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లగానే వారి వాటర్ బాటిళ్లలో నీటిని వృథాగా పారబోయటాన్ని పాఠశాల యాజమాన్యం గమనించింది. దీంతో నిత్యం పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లబోయేముందు విద్యార్థుల వద్ద ఉన్న బాటిళ్లలో మిగిలిన నీటిని అక్కడే ఖాళీగా ఉన్న డ్రమ్ముల్లో పోసి వెళ్లాల్సిందిగా సూచించారు. దీనిని విద్యార్థులు చక్కగా అర్థం చేసుకొన్నారు. దీంతో నిత్యం అక్కడ ఏర్పాటు చేసిన డ్రమ్ములు నిండి వేలాది లీటర్ల నీరు లభిస్తోంది. ఈ నీటితో పాఠశాల ఆవరణలో మొక్కలను పెంచుతున్నారు. ఇంకా మిగిలిన నీటిని కారిడార్.. పాఠశాల ఆవరణను శుభ్రం చేయడం వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. నీటి వృథా గణనీయంగా తగ్గింది.. మరో పక్క మోటార్ వేయాల్సిన అవసరం రాకపోవడంతో కరెంటు కూడా ఆదా అవుతోంది. అన్నిటికీ మించి జల సంరక్షణలో విద్యార్థులు కూడా భాగస్వాములవుతున్నారు. చిన్న వయసులోనే నీటి విలువ వారికి తెలుస్తోంది.తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు సిటీప్రైడ్ పాఠశాల ప్రయత్నాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు నీటి వృథాని అరికట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నారన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









