మోడీ తో డిబేట్ కు రెడీ అంటున్న పాక్ ప్రధాని..మోడీ స్పందనేంటి?
- February 23, 2022
ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, నీటి వనరుల సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చర్చించుకున్నా పరిష్కారం కాలేదు. కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్తో సంబంధాలు మరింత దిగజారాయి. పాక్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలికితేనే ఆ దేశంలో చర్చలు జరుపుతామని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇక ఇదిలా ఉంటే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత ప్రధానితో టీవీ డిబేట్లో పాల్గొనాలని ఉందని, ఈ డిబేట్ ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవలే రష్యాటుడే న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంతర్వ్యూలో భారత్, పాక్ సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. పీఎం మోడీ రెడీ అంటే తాను సిద్దంగా ఉన్నానని, టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొనడం ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు కొంతమేర మెరుగుపడే అవకాశం ఉంటుందని పాక్ పీఎం పేర్కొన్నారు. మరి దీనిపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







