మోడీ తో డిబేట్ కు రెడీ అంటున్న పాక్ ప్రధాని..మోడీ స్పందనేంటి?
- February 23, 2022
ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, నీటి వనరుల సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చర్చించుకున్నా పరిష్కారం కాలేదు. కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్తో సంబంధాలు మరింత దిగజారాయి. పాక్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలికితేనే ఆ దేశంలో చర్చలు జరుపుతామని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇక ఇదిలా ఉంటే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత ప్రధానితో టీవీ డిబేట్లో పాల్గొనాలని ఉందని, ఈ డిబేట్ ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవలే రష్యాటుడే న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంతర్వ్యూలో భారత్, పాక్ సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. పీఎం మోడీ రెడీ అంటే తాను సిద్దంగా ఉన్నానని, టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొనడం ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు కొంతమేర మెరుగుపడే అవకాశం ఉంటుందని పాక్ పీఎం పేర్కొన్నారు. మరి దీనిపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









