ఖతార్ లో మార్చి 31 వరకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు
- February 25, 2022_1645763353.jpg)
ఖతార్: ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను నియంత్రించే చట్టం నంబర్ 21/2015ను ఉల్లంఘించిన ప్రవాసుల చట్టబద్ధ స్థితిని సరిదిద్దడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి31 వరకు గ్రేస్ పీరియడ్ని పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరోసారి రిమైండర్ను జారీ చేసింది. ఉల్లంఘన పరిష్కార మొత్తంలో 50% తగ్గింపు నిచ్చారు. ఈ అవకాశాన్ని వ్యాపార యజమానులు, కార్మికులు వినియోగించుకోవాలని సూచించింది. ఉల్లంఘనల పరిష్కారం కోసం ఫాలో-అప్ విభాగానికి లేదా ఉమ్ సలాల్, అల్ రయ్యాన్, మెసైమీర్, అల్ వక్రా, ఉమ్ సునైమ్లోని సేవా కేంద్రాలను సందర్శించాలని కోరింది. ఈ గ్రేస్ పీరియడ్ నుండి రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు (కంపెనీలు), వర్క్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు లాభం పొందవచ్చని మినిస్ట్రీ అధికారులు పేర్కొన్నారు. యజమానులు, ప్రవాసులు తమ స్థితిని చట్టబద్ధం చేసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!