ఖతార్ లో మార్చి 31 వరకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు
- February 25, 2022
ఖతార్: ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను నియంత్రించే చట్టం నంబర్ 21/2015ను ఉల్లంఘించిన ప్రవాసుల చట్టబద్ధ స్థితిని సరిదిద్దడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి31 వరకు గ్రేస్ పీరియడ్ని పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరోసారి రిమైండర్ను జారీ చేసింది. ఉల్లంఘన పరిష్కార మొత్తంలో 50% తగ్గింపు నిచ్చారు. ఈ అవకాశాన్ని వ్యాపార యజమానులు, కార్మికులు వినియోగించుకోవాలని సూచించింది. ఉల్లంఘనల పరిష్కారం కోసం ఫాలో-అప్ విభాగానికి లేదా ఉమ్ సలాల్, అల్ రయ్యాన్, మెసైమీర్, అల్ వక్రా, ఉమ్ సునైమ్లోని సేవా కేంద్రాలను సందర్శించాలని కోరింది. ఈ గ్రేస్ పీరియడ్ నుండి రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు (కంపెనీలు), వర్క్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు లాభం పొందవచ్చని మినిస్ట్రీ అధికారులు పేర్కొన్నారు. యజమానులు, ప్రవాసులు తమ స్థితిని చట్టబద్ధం చేసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







