నైట్ కర్ఫ్యూను ఎత్తివేసిన దేశ రాజధాని
- February 25, 2022
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ. గతంలో మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధించేవారు.ఇప్పుడు దాన్ని 500 వరకు తగ్గించింది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో దుకాణాలు, రెస్టారెంట్లు, అర్థరాత్రి వరకు తెరిచి ఉంటాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవచ్చని చెప్పారు. అంతేకాదు బస్సులు, మెట్రో రైళ్లలో విధించిన నిబంధనలను సడలించిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









