పవిత్ర మసీదుల్లోకి 7 ఏళ్లు పైబడినవారికి అనుమతి
- February 26, 2022
సౌదీ: 7 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇప్పుడు రెండు పవిత్ర మసీదుల్లోకి ప్రవేశించడానికి అనుమతిని పొందవచ్చని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు తవక్కల్నా అప్లికేషన్ లో వారి ఆరోగ్య స్థితిని "ఇమ్యూన్"గా అప్డేట్ చేశారు. సౌదీ అరేబియాలో ఎవరైనా ఉమ్రా చేయాలనుకునే వారు యాప్లోని వారి ఆరోగ్య స్థితి “ఇమ్యూన్” అనే షరతుపై “ఈట్మార్నా” లేదా “తవక్కల్నా” అప్లికేషన్ల నుండి అనుమతి పొందవలసి ఉంటుందన్నారు. లబ్ధిదారుల డేటా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్రాకు ప్రతి 10 రోజులకు ఒకసారి అనుమతులు జారీ చేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ ఏర్పాటు కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, ఏవైనా అప్డేడ్ ఉంటే తగిన సమయంలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









