పవిత్ర మసీదుల్లోకి 7 ఏళ్లు పైబడినవారికి అనుమతి
- February 26, 2022
సౌదీ: 7 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇప్పుడు రెండు పవిత్ర మసీదుల్లోకి ప్రవేశించడానికి అనుమతిని పొందవచ్చని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు తవక్కల్నా అప్లికేషన్ లో వారి ఆరోగ్య స్థితిని "ఇమ్యూన్"గా అప్డేట్ చేశారు. సౌదీ అరేబియాలో ఎవరైనా ఉమ్రా చేయాలనుకునే వారు యాప్లోని వారి ఆరోగ్య స్థితి “ఇమ్యూన్” అనే షరతుపై “ఈట్మార్నా” లేదా “తవక్కల్నా” అప్లికేషన్ల నుండి అనుమతి పొందవలసి ఉంటుందన్నారు. లబ్ధిదారుల డేటా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్రాకు ప్రతి 10 రోజులకు ఒకసారి అనుమతులు జారీ చేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ ఏర్పాటు కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, ఏవైనా అప్డేడ్ ఉంటే తగిన సమయంలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







