ఎక్స్పో 2020 దుబాయ్: ఉచిత సీజన్ పాసుల్ని ప్రకటించిన యూఏఈ ఎయిర్ లైన్స్
- February 28, 2022
దుబాయ్: మరో నెల రోజుల్లో ఎక్స్పో 2020 దుబాయ్ ముగియనున్న దరిమిలా, నిర్వాహకులు ఎయిర్ లైన్స్ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మరిన్ని ఆఫర్స్ ప్రకటిస్తుండడం జరుగుతోంది. మార్చి 31 వరకు సీజన్ పాస్ ఫినాలె అందులో ఒకటి. దీని ద్వారా ఎన్నిసార్లైనా ఎక్స్పో దుబాయ్ 2020 సందర్శించవచ్చు. దీనికోసం 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుంది. కాగా, యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు సీజన్ పాసుల్ని ప్రయాణీకులకు ఆఫర్ చేస్తున్నాయి. ఉచిత డే పాసుల్ని తమ ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. కాంప్లిమెంటరీ సింగిల్ డే పాస్.. ఇప్పుడు సీజన్ పాస్గా మారిందని సంస్థ పేర్కొంది. అబుదాబీ విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాల్లో ఎక్స్పో ప్రాంతానికి చేరుకోవచ్చని ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. ఫ్లై దుబాయ్ వంటి సంస్థలు కూడా ఇవే తరహా ఆఫర్లను అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక









