ఎక్స్పో 2020 దుబాయ్: ఉచిత సీజన్ పాసుల్ని ప్రకటించిన యూఏఈ ఎయిర్ లైన్స్
- February 28, 2022
దుబాయ్: మరో నెల రోజుల్లో ఎక్స్పో 2020 దుబాయ్ ముగియనున్న దరిమిలా, నిర్వాహకులు ఎయిర్ లైన్స్ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మరిన్ని ఆఫర్స్ ప్రకటిస్తుండడం జరుగుతోంది. మార్చి 31 వరకు సీజన్ పాస్ ఫినాలె అందులో ఒకటి. దీని ద్వారా ఎన్నిసార్లైనా ఎక్స్పో దుబాయ్ 2020 సందర్శించవచ్చు. దీనికోసం 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుంది. కాగా, యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు సీజన్ పాసుల్ని ప్రయాణీకులకు ఆఫర్ చేస్తున్నాయి. ఉచిత డే పాసుల్ని తమ ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. కాంప్లిమెంటరీ సింగిల్ డే పాస్.. ఇప్పుడు సీజన్ పాస్గా మారిందని సంస్థ పేర్కొంది. అబుదాబీ విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాల్లో ఎక్స్పో ప్రాంతానికి చేరుకోవచ్చని ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. ఫ్లై దుబాయ్ వంటి సంస్థలు కూడా ఇవే తరహా ఆఫర్లను అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









