ఎక్స్పో 2020 దుబాయ్: ఉచిత సీజన్ పాసుల్ని ప్రకటించిన యూఏఈ ఎయిర్ లైన్స్
- February 28, 2022
దుబాయ్: మరో నెల రోజుల్లో ఎక్స్పో 2020 దుబాయ్ ముగియనున్న దరిమిలా, నిర్వాహకులు ఎయిర్ లైన్స్ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మరిన్ని ఆఫర్స్ ప్రకటిస్తుండడం జరుగుతోంది. మార్చి 31 వరకు సీజన్ పాస్ ఫినాలె అందులో ఒకటి. దీని ద్వారా ఎన్నిసార్లైనా ఎక్స్పో దుబాయ్ 2020 సందర్శించవచ్చు. దీనికోసం 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుంది. కాగా, యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు సీజన్ పాసుల్ని ప్రయాణీకులకు ఆఫర్ చేస్తున్నాయి. ఉచిత డే పాసుల్ని తమ ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. కాంప్లిమెంటరీ సింగిల్ డే పాస్.. ఇప్పుడు సీజన్ పాస్గా మారిందని సంస్థ పేర్కొంది. అబుదాబీ విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాల్లో ఎక్స్పో ప్రాంతానికి చేరుకోవచ్చని ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. ఫ్లై దుబాయ్ వంటి సంస్థలు కూడా ఇవే తరహా ఆఫర్లను అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







