ఏపీ కరోనా అప్డేట్

- March 02, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,008 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 101 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 458 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

నేటివరకు రాష్ట్రంలో 3,31,26,189 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,054 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేటి వరకు 23,01,668 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 729. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,657. క్రితం రోజుతో(141) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com