ఎక్స్‌పో 2020 టిక్కెట్లు పంపిణీ చేస్తోన్న దుబాయ్ కస్టమ్స్

- March 04, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2020 టిక్కెట్లు పంపిణీ చేస్తోన్న దుబాయ్ కస్టమ్స్

దుబాయ్: దుబాయ్ కస్టమ్స్-కార్పొరేట్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్, ఎక్స్‌పో 2020 దుబాయ్ కోసం ఒక రోజు ఎంట్రీ లభించే 443 టిక్కెట్లను ఉచితంగా ప్రయాణీకులకు పంపిణీ చేయడం జరిగింది. ఎమిరేట్స్ ఎయిర్, సీ మరియు ల్యాండ్ పోర్టుల వద్ద వీటిని పంపిణీచేశారు. హట్టా బోర్డర్, దుబాయ్ ఎయిర్ పోర్టులు అలాగే రషీద్ పోర్టు వద్ద వీటి పంపకాల్ని చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, అతి పెద్దదైన ఈవెంట్‌కి మరింత వన్నె తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్ చివరి రోజు వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించేలా ఈ తరహా చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com