143 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్టు

- March 05, 2022 , by Maagulf
143 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్టు

రియాద్: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై మొత్తం 143 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. గత నెలలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నజాహా చేపట్టిన 5072 తనీఖీల్లో 544 మంది అనుమానితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిలో 143 మందిని అరెస్టు చేసినట్లు నజాహా శుక్రవారం తెలిపింది. అరెస్టైన వారిలో రక్షణ, హోం, హెల్త్, న్యాయం, ఎడ్యుకేషన్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రజా ధనాన్ని రక్షించడానికి, పరిపాలనా అవినీతికి చెక్ పెట్టేందుకు అవినీతి అధికారుల సమాచారం అందించాలని ప్రజలను నజాహా కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com