కమర్షియల్ వీసాలను హోల్డ్ లో పెట్టిన కువైట్
- March 06, 2022
కువైట్:అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రకాల విజిట్ వీసాలు, ముఖ్యంగా ప్రవాస కుటుంబాలకు జారీ చేయాలని యోచిస్తున్న తరుణంలో.. కమర్షియల్ విజిట్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. అరబ్ దేశ పౌరులు అనేక మంది భిక్షాటన చేస్తూ పట్టుబడటం.. అలాగే పవిత్ర రంజాన్ మాసానికి ముందే కువైట్కు చాలామంది చేరుకున్నారని అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒరకు తెలిపారు. విజిటర్ వీసా జారీ చేయడానికి ముందు కువైట్లో ఆమోదించబడిన వ్యాక్సిన్ల ను తీసుకున్నట్లు నిర్ధారించుకునే విధానాలను అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. రెసిడెన్సీ వ్యవహారాల విభాగం విజిట్ వీసాలను జారీ చేస్తుందని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్లైన్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాలను చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుదల నేపథ్యంలోమంత్రిత్వ శాఖ త్వరలో కొత్త నిబంధనలను ప్రకటించాలని భావిస్తుందని, ఆ తర్వాతే వీసాల జారీ ఉండే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







