రైళ్లలో హాఫ్ టికెట్కు బర్త్ రిజర్వేషన్ లేదు..
- March 31, 2016
రైళ్లలో ప్రయాణించే ఐదునుంచి పన్నెండేళ్ల వయస్సున్న పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్తులు రిజర్వ్ చేసుకోవాలంటే వారికి కూడా పెద్దవారితో సమానంగా పూర్తి టికెట్ కొనాల్సిందే. హాఫ్ టికెట్ కొంటే వారికి బెర్తులు కేటాయించరు. ఈ విధానం నేటినుంచి అమల్లోకి వచ్చింది. 5నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు రైళ్లలో ప్రయాణించడానికి రైల్వే శాఖ టికెట్ ఛార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుంది.దీనిని మనం హాఫ్ టికెట్ అంటూ వ్యవహరిస్తుంటాం. ప్రతియేటా సుమారు రెండున్నర కోట్ల మంది చిన్నారులు హాఫ్టికెట్తో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఇన్నాళ్లూ తమ పిల్లలతో ఊళ్లకు వెళ్లే తల్లిదండ్రులు వారికి హాఫ్ టికెట్ తీసుకున్నా ప్రత్యేకంగా బెర్తులు కేటాయించేవారు. ఈ విధానానికి రైల్వే శాఖ స్వస్తి చెప్పింది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో ప్రయాణీకుల ఛార్జీలు పెంచని కారణంగా ఎదురయ్యే లోటును భర్తీ చేసుకోవడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







