స్వచ్ఛంద సంస్థలకు ల్యాప్‌టాప్‌లు అందజేసిన KPMG

- March 09, 2022 , by Maagulf
స్వచ్ఛంద సంస్థలకు ల్యాప్‌టాప్‌లు అందజేసిన KPMG

బహ్రెయిన్‌: స్థానిక కమ్యూనిటీలోని విద్యార్థులు చదువుకు కృషి చేస్తున్న అల్ ఎకర్ ఛారిటీ సంస్థకు KPMG ల్యాప్ టాప్ లు అందజేసింది. ఈ సందర్భంగా బహ్రెయిన్‌లోని KPMG కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ హెడ్ సయీద్ రాధి మాట్లాడుతూ..  మహమ్మారి అనంతర కాలంలో విద్యార్థులు ఇంటి నుండి చదువుకోవడానికి, పని చేయడానికి ల్యాపీలు ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్ తరం యువ నాయకులు ఎదగడానికి ఇలాంటివి సాయం చేస్తాయన్నారు. బహ్రెయిన్ యువ ప్రతిభను పెంపొందించడంలో మా నిరంతర కృషి కొనసాగుతుందన్నారు. అల్ ఎకర్ ఛారిటీ సంస్థకు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తోంది. వాలంటీర్ల మద్దతుతో అల్ ఎకర్ ఛారిటీ సంస్థ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com