బ్లాక్ లీస్టులో 40 మంది ప్రవాసులు వర్క్ పర్మిట్లు
- March 09, 2022
కువైట్: సోమవారం మధ్యాహ్నం ప్రింటింగ్ 'డెన్'లో నకిలీ ఐడీలు గుర్తించిన తర్వాత 40 మంది ప్రవాసులను విచారణకు పిలిచే పనిలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ ఉంది. నకిలీ ఐడీలను ముద్రిస్తున్న గుర్తుతెలియని ఆసియన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నికిలీ ఐడీలతో ఉద్యోగాలు చేస్తున్న వారికి సమన్లు జారీ చేయనున్నారు. వారి వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను నిరోధించడానికి వారి పేర్లతో ఒక 'బ్లాక్ లీస్టు' ను రూపొందించారు. మెడికల్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, సివిల్ ఐడీలు వంటి వివిధ నకిలీ పత్రాలను సీఐడీ అధికారులు గుర్తించారు. కొంతకాలంగా నకిలీ ఐడీలను ఫోర్జరీ చేస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఒక ప్రవాసుడు నకిలీ పత్రాలను ఉపయోగించి చమురు సంస్థలో ఉద్యోగంలోకి చేరేందుకు వచ్చిన సమయంలో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించి.. అతని వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని భద్రతా దళాలు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







