బహ్రెయిన్ లో ‘మనామా గోల్డ్’ ఫెస్టివల్

- March 10, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ‘మనామా గోల్డ్’ ఫెస్టివల్

బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) రాజ్యంలో మొట్టమొదటిసారిగా మనామా సౌక్‌లో "మనమా గోల్డ్" ఫెస్టివల్ ను నిర్వహించనుంది. మార్చి 20 నుండి ఏప్రిల్ 20 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లను విక్రయించే దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా BTEA.. ఎగ్జిబిషన్లు, సాంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బంగారు పరిశ్రమ, బహ్రెయిన్ లోని వాణిజ్యంపై డాక్యుమెంటరీలు, పిల్లల కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్, బహుమతులు అందించే ఈవెంట్లతోపాటు అనేక అనుబంధ ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. మనామా డిజిటల్ మ్యూజియం "ది మనామా స్టోరీ" సహకారంతో అధికార యంత్రాంగం ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com