రెండు పవిత్ర మసీదుల వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీని ఎత్తివేసిన సౌదీ అరేబియా

- March 10, 2022 , by Maagulf
రెండు పవిత్ర మసీదుల వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీని ఎత్తివేసిన సౌదీ అరేబియా

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, మక్కాలోని గ్రాండ్ మసీదు అలాగే మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం వెలుపల నుంచి వచ్చే యాత్రీకులకు సంబంధించి ఇమ్యునైజేషన్ డేట రిజిస్ట్రేషన్ పక్రియను కూడా ఎత్తివేశారు. కాగా, ఉమ్రా ప్రార్థనలకు అలాగే అల్ రావ్దాహ్ అల్ షరీఫా సందర్శనకు మాత్రం అనుమతులు తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చేవారికి వచ్చిన వెంటనే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ చూపించాల్సి రావడం, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వంటివాటిని కూడా తొలగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com