దొంగతనాల నుంచి ఇంటికి ఇన్స్యూరెన్స్
- April 01, 2016
యూఏఈలో 1 శాతం కంటే తక్కువ ఇళ్ళకే, తమ ఇంట్లోని విలువైన వస్తువులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ఉందని ఓ ఇన్స్యూరెన్స్ సంస్థ వెల్లడించింది. దొంగతనాల కారణంగా విలువైన వస్తువల్ని కోల్పోతే అది ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయనీ, అలాంటి సందర్భాల్లో ఇన్స్యురెన్స్ వారికి అండగా నిలుస్తుందని సంస్థ ప్రతినిథులు చెప్పారు. ఇంటిని మాత్రమే కాకుండా, ఇంట్లోని వస్తువుల్ని కూడా ఇన్స్యూర్ చేసుకోవడం మంచిదనీ, ఈ విషయంలో తాము ఎంతగా అవగాహనా కార్యక్రమాలు చేపడ్తున్నా, వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడంలేదనీ మెనా రిటైల్, ఖతార్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రెడ్రిక్ బిస్బ్జెర్గ్ చెప్పారు. ఇదిలా ఉండగా, తమ ఇళ్ళు దోపిడీకి గురి కాకుండా, తాము ఇంట్లో లేనప్పుడు సన్నిహితులు, బంధువులు, లేదా సమీపంలో ఉండే స్నేహితుల్ని అప్పుడప్పుడూ తమ ఇంటిని గమనించాల్సిందిగా సూచించాలి. లాక్ చేసే సమయంలో అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే భద్రతా ఏర్పాట్లు ముఖ్యం. ప్రధానంగా ఇంట్లో పనిచేసేవారితో దొంగలు సఖ్యంగా ఉంటారు. పని మనుషుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







