దొంగతనాల నుంచి ఇంటికి ఇన్స్యూరెన్స్
- April 01, 2016
యూఏఈలో 1 శాతం కంటే తక్కువ ఇళ్ళకే, తమ ఇంట్లోని విలువైన వస్తువులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ఉందని ఓ ఇన్స్యూరెన్స్ సంస్థ వెల్లడించింది. దొంగతనాల కారణంగా విలువైన వస్తువల్ని కోల్పోతే అది ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయనీ, అలాంటి సందర్భాల్లో ఇన్స్యురెన్స్ వారికి అండగా నిలుస్తుందని సంస్థ ప్రతినిథులు చెప్పారు. ఇంటిని మాత్రమే కాకుండా, ఇంట్లోని వస్తువుల్ని కూడా ఇన్స్యూర్ చేసుకోవడం మంచిదనీ, ఈ విషయంలో తాము ఎంతగా అవగాహనా కార్యక్రమాలు చేపడ్తున్నా, వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడంలేదనీ మెనా రిటైల్, ఖతార్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రెడ్రిక్ బిస్బ్జెర్గ్ చెప్పారు. ఇదిలా ఉండగా, తమ ఇళ్ళు దోపిడీకి గురి కాకుండా, తాము ఇంట్లో లేనప్పుడు సన్నిహితులు, బంధువులు, లేదా సమీపంలో ఉండే స్నేహితుల్ని అప్పుడప్పుడూ తమ ఇంటిని గమనించాల్సిందిగా సూచించాలి. లాక్ చేసే సమయంలో అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే భద్రతా ఏర్పాట్లు ముఖ్యం. ప్రధానంగా ఇంట్లో పనిచేసేవారితో దొంగలు సఖ్యంగా ఉంటారు. పని మనుషుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







