పనిమనిషిని వేధించిన యజమానికి 15 ఏళ్ల జైలు

- March 12, 2022 , by Maagulf
పనిమనిషిని వేధించిన యజమానికి 15 ఏళ్ల జైలు

దుబాయ్: విదేశీ పౌరసత్వం ఉన్న అరబ్ మేనేజర్‌పై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ జారీ చేసిన జీవిత ఖైదును 15 సంవత్సరాల జైలుశిక్షగా దుబాయ్ అప్పీలేట్ కోర్ట్ మార్చింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని దేశం నుంచి బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. నిందితుడు తన వద్ద పనిచేసిన ఒక ఆసియా పనిమనిషిని నిర్బంధించి, చనిపోయే వరకు ఆమెపై దాడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు సెప్టెంబర్ 2020 లో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆసియా మహిళను దుబాయ్‌లోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుదూ సదరు మహిళ మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. తీవ్ర గాయాలతోనే సదరు మహిళ మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో నిందితుడి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్షను దుబాయ్ కోర్టు విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com