భారత జాలర్లు పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు

- April 01, 2016 , by Maagulf
భారత జాలర్లు పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు

భారత్‌కు చెందిన 59 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు. మత్స్యకారులకు చెందిన 10 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత సరిహద్దు జలాలను దాటి తమ జలాల్లోకి వచ్చారంటూ పాకిస్థాన్‌ సముద్ర జలాల రక్షణ ఏజెన్సీ(ఎంఎస్‌ఏ) అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్‌, సింధ్‌ సరిహద్దుల్లో వివాదాస్పద సర్‌ క్రీక్‌ ప్రాంతంలో జాలర్లు వేటకు వెళ్లగా పాక్‌ అధికారులు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. జాలర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాదాస్పద జలాల్లో చేపల వేట కారణంగా పాక్‌, భారత జాలర్లు తరచూ అరెస్టవుతుంటారు.
ఇటీవల పాకిస్థాన్‌ భారత్‌కు చెందిన 86 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది మత్స్యకారులు జైళ్లలో మగ్గుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com