భారత జాలర్లు పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు
- April 01, 2016
భారత్కు చెందిన 59 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. మత్స్యకారులకు చెందిన 10 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత సరిహద్దు జలాలను దాటి తమ జలాల్లోకి వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర జలాల రక్షణ ఏజెన్సీ(ఎంఎస్ఏ) అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్, సింధ్ సరిహద్దుల్లో వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో జాలర్లు వేటకు వెళ్లగా పాక్ అధికారులు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. జాలర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాదాస్పద జలాల్లో చేపల వేట కారణంగా పాక్, భారత జాలర్లు తరచూ అరెస్టవుతుంటారు.
ఇటీవల పాకిస్థాన్ భారత్కు చెందిన 86 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది మత్స్యకారులు జైళ్లలో మగ్గుతున్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









