స్మశానాల్లో అంత్యక్రియల్ని ఫోటోలు తీస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!

- March 15, 2022 , by Maagulf
స్మశానాల్లో అంత్యక్రియల్ని ఫోటోలు తీస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!

కువైట్: కువైట్ మునిసిపాలిటీ - డైరెక్టర్ ఆఫ్ ఫ్యునరల్ డిపార్టుమెంట్ డాక్టర్ ఫైసల్ అల్ అవాదీ వెల్లడించిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే 5,000 కువైటీ దినార్ల జరీమానా విధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు, అథ్లెట్లు, సెలబ్రిటీలు వంటివారి ఇంట్లో విషాద ఘటన జరిగినప్పుడు, అంత్యక్రియల సమయంలో స్మశానాల వద్ద అకారణంగా గుమికూడేవారి సంఖ్య పెరగడం, ఫొటోలు, వీడియోలు తీయడం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారుతోంది. స్మశానాల్ని నిర్దేశిత పనుల నిమిత్తం తప్ప, ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదు. అలా వినియోగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఆయా చట్టాలు కల్పిస్తున్నాయి. 2,000 దినార్లకు తగ్గకుండా 5,000 దినార్లకు మించకుండా ఉల్లంఘనలకు జరీమానా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com