దుబాయ్ గురుద్వారాలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ..

- March 19, 2022 , by Maagulf
దుబాయ్ గురుద్వారాలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ..

దుబాయ్: యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. శుక్రవారం దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు.ఆయన సతీమణి శివమాలతో కలిసి ప్రార్థనలు చేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమా కోహ్లీ ఉన్నారు.ఈ సందర్భంగా గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ కాంధారి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.గురువారం అబుధాబిలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొన్నారు.అక్కడి ప్రవాస భారతీయులు ఆయనను ఘనంగా సత్కరించారు.ఆదివారం నాడు దుబాయ్ తెలుగు అసోసియేషన్ వారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com