పోలీసులపై దాడికి పాల్పడితే 5 ఏళ్ల జైలుశిక్ష
- March 22, 2022
కువైట్: విధినిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇటీవలి కాలంలో పోలీసు అధికారులపై పదే పదే దాడులు జరిగిన సంఘటనలు నమోదవడంతో మంత్రిత్వ శాఖ స్పందించింది. పోలీసుల విధులకు అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో అతనిపై దాడి చేసినట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 5,000 దీనార్లు ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. మాటలతో దూషించడం లేదా అవమానించడం లాంటి చర్యలకు పాల్పడితే రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష, 3,000 దీనార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని గుర్తు చేసింది. పబ్లిక్ ఆర్డర్ను పరిరక్షించడానికి సిటిజన్స్/రెసిడెంట్స్ కట్టుబడి ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







