పోలీసులపై దాడికి పాల్పడితే 5 ఏళ్ల జైలుశిక్ష
- March 22, 2022
కువైట్: విధినిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇటీవలి కాలంలో పోలీసు అధికారులపై పదే పదే దాడులు జరిగిన సంఘటనలు నమోదవడంతో మంత్రిత్వ శాఖ స్పందించింది. పోలీసుల విధులకు అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో అతనిపై దాడి చేసినట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 5,000 దీనార్లు ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. మాటలతో దూషించడం లేదా అవమానించడం లాంటి చర్యలకు పాల్పడితే రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష, 3,000 దీనార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని గుర్తు చేసింది. పబ్లిక్ ఆర్డర్ను పరిరక్షించడానికి సిటిజన్స్/రెసిడెంట్స్ కట్టుబడి ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







