చోరీ చేస్తూ దొరికిన ఎయిర్పోర్ట్ పోర్టర్
- March 22, 2022
యూఏఈ: దుబాయ్ విమానాశ్రయంలో 29 ఏళ్ల పోర్టర్.. ప్రయాణీకుల బ్యాగ్ నుండి మొబైల్ ఫోన్లను దొంగిలించిన ఆరోపణలపై మూడు నెలల జైలు శిక్ష, Dh28,000 జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు అధికారులను ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 2021లో ఒక ఆసియా ప్రయాణీకుడు తన స్వదేశానికి వెళ్లిన తర్వాత తన సూట్కేస్లో ఆరు మొబైల్ ఫోన్లు కన్పించలేదు. దాంతో అతడు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించి పోర్టర్ ఆ మొబైల్ ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు అనుమానితుడి ఇంటిని సోదా చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసింది. విచారణలో, తాను మొబైల్ ఫోన్లను దొంగిలించానని, వాటిలో ఐదింటిని మొబైల్ ఫోన్ షాపులో 10,000 దిర్హామ్లకు విక్రయించినట్లు పోర్టర్ అంగీకరించాడు. 5,000 దిర్హామ్లతో విలువైన సన్గ్లాసెస్, కెమెరా, మొబైల్ ఫోన్, వైర్లెస్ హెడ్సెట్, ఇతర ఉపకరణాలను కొన్నట్లు విచారణలో నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







