చోరీ చేస్తూ దొరికిన ఎయిర్పోర్ట్ పోర్టర్
- March 22, 2022
యూఏఈ: దుబాయ్ విమానాశ్రయంలో 29 ఏళ్ల పోర్టర్.. ప్రయాణీకుల బ్యాగ్ నుండి మొబైల్ ఫోన్లను దొంగిలించిన ఆరోపణలపై మూడు నెలల జైలు శిక్ష, Dh28,000 జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు అధికారులను ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 2021లో ఒక ఆసియా ప్రయాణీకుడు తన స్వదేశానికి వెళ్లిన తర్వాత తన సూట్కేస్లో ఆరు మొబైల్ ఫోన్లు కన్పించలేదు. దాంతో అతడు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించి పోర్టర్ ఆ మొబైల్ ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు అనుమానితుడి ఇంటిని సోదా చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసింది. విచారణలో, తాను మొబైల్ ఫోన్లను దొంగిలించానని, వాటిలో ఐదింటిని మొబైల్ ఫోన్ షాపులో 10,000 దిర్హామ్లకు విక్రయించినట్లు పోర్టర్ అంగీకరించాడు. 5,000 దిర్హామ్లతో విలువైన సన్గ్లాసెస్, కెమెరా, మొబైల్ ఫోన్, వైర్లెస్ హెడ్సెట్, ఇతర ఉపకరణాలను కొన్నట్లు విచారణలో నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







