టీఎస్ఆర్టీసీ: మరో కార్యక్రమానికి శ్రీకారం..
- March 24, 2022
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఆర్టీసీని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో మునుపెన్నడూ లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలతో టీఎస్ఆర్టీసీ మమేకం చేసేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టీవ్గా ఉంటూ.. ఆర్టీసీకి సంబంధించిన ఎవైనా సమస్యలు, సలహాలు ఇచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న.. తెలంగాణాకే తలమానికమైన సమక్క-సారక్క జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటివరకు చేర్చే బాధ్యతను తీసుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏప్రిల్ 10 శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగనుంది. అయితే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ముంగిటికి తీసుకువచ్చే భారాన్ని మరోసారి టీఎస్ ఆర్టీసీ ఎత్తుకుంది. దీనికోసం భక్తులు చేయాల్సిందల్లా.. టీఎస్ఆర్టీసీ పార్శిల్ కౌంటర్లో రూ.80లు చెల్లించి బుక్ చేసుకోవడమే. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం. 040-30102829, 68153333తో పాటు https://www.tsrtc.telangana.gov.in
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









