సౌదీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- March 24, 2022
సౌదీ: దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న నార్కోటిక్ పిల్స్ ను జెడ్డాలో సౌదీ అరేబియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ యువకుల భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ లపై సౌదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా స్మగ్లింగ్ నెట్ వర్క్ లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో నిమ్మకాయల రవాణాలో దాచిపెట్టి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 3,320,000 యాంఫెటమైన్ మాత్రలను సౌదీ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాంఫెటమైన్ మాత్రల తరలింపులో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









