రియల్ ఎస్టేట్ కోసం కొత్త ‘చట్టం’
- June 11, 2015
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యన్, అబుదాబి రియల్ ఎస్టేట్కి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ కార్యకలాపాలన్నీ ఓ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ ఎఫైర్స్ అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలేవీ జరగకుండా ఈ చట్టాన్ని రూపొందించారు. అమ్మకం, కొనుగోలు ఇలా ఏ లావాదేవీ అయినాసరే, ఆ రిజిస్టర్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రియల్ ఎస్టేట్లో తలెత్తే సమస్యల నుంచి వినియోగదారులు, అమ్మకందార్లు ఉపశమనం పొందుతారని ప్రభుత్వం చెబుతుంది. వినియోగదారులకు ఉన్న హక్కుల్ని సంరక్షించేలా కొత్త చట్టం ఉపయోగడుతుందని అంటున్న ప్రభుత్వం, ఈ కొత్త చట్టం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఊపందుకుంటుందనీ, వివాదాల్లేని రియల్ ఎస్టేట్ రంగానికి దిశానిర్దేశం చూపుతుందని వెల్లడించింది. అనుముతులు, ప్లానింగ్, కొనుగోలు, అమ్మకం, లావాదేవీలు ఇలా అన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ ఎఫైర్స్ కనుసన్నల్లో జరగడం వల్ల వినియోగదారుల్లోనూ భద్రత పెరుగుతుందని ప్రభుత్వం అంటుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







