ఏప్రిల్ 1 నుంచి ఇండియాకి వీక్లీ విమానాల్ని పెంచనున్న ఎమిరేట్స్
- March 25, 2022
యూఏఈ: కోవిడ్ పాండమిక్ కంటే ముందున్న సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించేందుకోసం ఎమిరేట్స్ చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలోని వివిధ నగరాలకు వారంలో 170 విమాన సర్వీసుల్ని నడపనుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల కల్పించిన వెసులుబాట్ల నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ చర్యలు తీసుకుంటోంది. కాగా, ఫ్లెక్సిబుల్ బుకింగ్ పాలసీలను కూడా మే 31 వరకు పొడిగించింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. ముంబైకి వారంలో 35 విమానాలు, న్యూ ఢిల్లీకి 28 విమానాలు, బెంగళూరుకి 24 విమానాలు, చెన్నయ్ 21 విమానాలు, హైద్రాబాద్ 21 విమానాలు, కోచి 14 విమానాలు, కోల్కతా 11, అహ్మదాబాద్ 9, తిరువనంతపురం 7 వీక్లీ విమానాలు ఎమిరేట్స్ ద్వారా నిర్వహించబడతాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









