రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
- March 28, 2022
న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది.మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా మార్చి 28న జరిగే రెండో విడత కార్యక్రమంలో 74 మందికి పురస్కారాలు అందజేస్తారు.ఢిల్లీ వేదికగా జరగనున్న కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డుల ప్రదానం జరగనుంది.యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణానంతరం అతని కుటుంబీకులకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు.
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం , విద్య, క్రీడలు,పౌర సేవల విభాగాలలో కృషి చేసిన వారికి ఏటా పద్మ అవార్డులతో కేంద్రం సత్కారాలు అందజేస్తుంది.ఈ క్రమంలోనే 2022 సంవత్సరానికి నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.పద్మా అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉండగా 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలతో పాటు విదేశీయులు, ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









