రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
- March 28, 2022
న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది.మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా మార్చి 28న జరిగే రెండో విడత కార్యక్రమంలో 74 మందికి పురస్కారాలు అందజేస్తారు.ఢిల్లీ వేదికగా జరగనున్న కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డుల ప్రదానం జరగనుంది.యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణానంతరం అతని కుటుంబీకులకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు.
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం , విద్య, క్రీడలు,పౌర సేవల విభాగాలలో కృషి చేసిన వారికి ఏటా పద్మ అవార్డులతో కేంద్రం సత్కారాలు అందజేస్తుంది.ఈ క్రమంలోనే 2022 సంవత్సరానికి నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.పద్మా అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉండగా 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలతో పాటు విదేశీయులు, ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు