ఎక్స్పో 2020 చివరి రోజున 24 గంటలూ నడవనున్న దుబాయ్ మెట్రో
- March 29, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 ముగింపు నేపథ్యంలో దుబాయ్ మెట్రో 24 గంటలూ నడవనుంది. సందర్శకుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 31న అత్యధిక సంఖ్యలో సందర్శకులు వుంటారని అంచనా వేస్తున్నారు. ముగింపు కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దరిమిలా, సందర్శకులు ఎక్స్పో 2020ని వీక్షించేందుకు ముందస్తుగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఆయా ప్రత్యేక కార్యక్రమాలకు సంబందించి సందర్శకుల్ని పరిమితం చేయనున్న దరిమిలా, ముందు వచ్చినవారికే ముందు అవకాశం దక్కనుంది. అయితే, ఎక్స్పో ప్రాంతంలో జెయింట్ స్క్రీన్లపై వాటిని చూడవచ్చు.సాయంత్రం నాలుగు గంటలకు జెట్స్ ఆకాశంలో రంగులద్దనున్నాయి. రాత్రి 7 గంటలకు అల్ వాసల్ ప్లాజా వద్ద 400 మంది ప్రదర్శన ఇవ్వనున్నారు. 8 గంటలకు యోయో మా నిర్వహించబడుతుంది దుబాయ్ మిలినీయం యాంఫీ థియేటర్ వద్ద. 8.30 నిమిషాలకు జూబ్లీ స్టేస్ వద్ద నోరా జోన్స్ ప్రదర్శన.. ఇంకా మరిన్ని ప్రత్యేక ప్రదర్శనలు వుండనున్నాయి.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!