ఇండియన్ ఎంబసీ ఎంప్లాయ్ అరెస్ట్
- March 30, 2022
సౌదీ: ఓ మహిళను ఫోన్లో వేధించినందుకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ప్రణవ్ కృష్ణని అరెస్టు చేశారు. సౌదీ అరేబియా నుంచి దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత పోలీసులు ఏడాది క్రితం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ప్రణవ్ కృష్ణ సెలవుల కోసం కేరళకు వచ్చారు. లుకౌట్ నోటీసు ఆధారంగా ఎయిర్పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రణవ్ అంతర్జాతీయ నంబర్లు, ఇంటర్నెట్ ద్వారా మహిళలను వేధించేవాడని సమాచారం. అతను దాదాపు ఏడాదిన్నర కాలంగా ఓ మహిళను ఇబ్బంది పెడుతున్నాడని, ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు