దోపిడీ కేసులో బహ్రెయిన్ వ్యక్తి నిర్దోషి
- April 01, 2022
బహ్రెయిన్: ఇద్దరు దొంగలను తన కారులో దొంగతనం ప్రాంతానికి తన కారులో తీసుకెళ్లిన బహ్రెయిన్ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా పేర్కొని విడిచిపెట్టింది. దొంగల ప్లాన్ గురించి తెలిసినట్లు ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా పేర్కొంటూ అతడిని విడుదల చేయాలని తీర్పునిచ్చింది. పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. నిందితులు సమీపంలోని మాల్కు తీసుకెళ్లాలని డ్రైవర్ అయిన బహ్రెయిన్ వ్యక్తిని అడిగారు. వారి ఉద్దేశం తెలియని అతడు వారిని సమీపంలోని మాల్ దగ్గరకు తీసుకెళ్లాడు. అనంతరం నిందితులు అక్కడ ఛారిటీ బాక్సులను దొంగిలించి పారిపోయే క్రమంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలో వారికి సహకరించిన డ్రైవర్ ను సైతం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. తన క్లయింట్ ఓ డ్రైవర్ అని అతడికి దొంగల ప్లాన్ గురించి తెలియదని డ్రైవర్ లాయర్ కోర్టులో వాదించింది. అంతకుముందు ఈ కేసులో అరెస్టయిన దొంగలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముందు డ్రైవర్ కు దీనితో సంబంధం లేదని చెప్పడంతో డ్రైవర్ ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు.
తాజా వార్తలు
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!









