నలుగురు భారతీయులను విడుదల ...

- April 03, 2016 , by Maagulf
నలుగురు భారతీయులను విడుదల ...

సిరియా ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న నలుగురు భారతీయులను విడుదల చేయించడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. '' అరుణ కుమార్‌ సైని, సర్వజిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌, జోగ సింగ్‌లకు స్వాగతం'' అని ట్వీట్‌ చేశారు. వీరు నలుగరు ఐఎస్‌ ఉగ్రసంస్థలో చేరేందుకు వచ్చినట్లు భావించిన సిరియా ప్రభుత్వం గత జనవరిలో అరెస్టు చేసింది. ఇటీవల సిరియా ఉప ప్రధాని భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా వారిని విడుదల చేయాలని ఆయన్ను కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.వీరు జోర్డాన్‌ నుంచి సిరియాలోకి ప్రవేశించి డమాస్కస్‌కు చేరుకోగా.. అక్కడ ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. వీరిని ఐఎస్‌ సానుభూతి పరులుగా అనుమానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com