నలుగురు భారతీయులను విడుదల ...
- April 03, 2016
సిరియా ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న నలుగురు భారతీయులను విడుదల చేయించడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. '' అరుణ కుమార్ సైని, సర్వజిత్ సింగ్, కుల్దీప్ సింగ్, జోగ సింగ్లకు స్వాగతం'' అని ట్వీట్ చేశారు. వీరు నలుగరు ఐఎస్ ఉగ్రసంస్థలో చేరేందుకు వచ్చినట్లు భావించిన సిరియా ప్రభుత్వం గత జనవరిలో అరెస్టు చేసింది. ఇటీవల సిరియా ఉప ప్రధాని భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా వారిని విడుదల చేయాలని ఆయన్ను కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.వీరు జోర్డాన్ నుంచి సిరియాలోకి ప్రవేశించి డమాస్కస్కు చేరుకోగా.. అక్కడ ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. వీరిని ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







