దోహాలో మూడు కొత్త మ్యూజియాలు, వాటర్ ఫ్రంట్ ఆర్ట్ మిల్

- April 04, 2022 , by Maagulf
దోహాలో మూడు కొత్త మ్యూజియాలు, వాటర్ ఫ్రంట్ ఆర్ట్ మిల్

ఖతార్: ఖతార్ రాజధాని దోహాలో 559,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న లుసాల్ మ్యూజియంతో సహా మరో మూడు మ్యూజియాలను నిర్మించాలని ఖతార్ యోచిస్తోంది. అతిపెద్ద క్రీడా మహోత్సవం FIFA ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఖతార్.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆటోమొబైల్ పరిణామాన్ని దాని ఆవిష్కరణ నుండి నేటి వరకు ఖతార్‌లో సంస్కృతిని ఎలా ప్రభావితం చేసిందో తెలిపేలా ఖతార్ ఆటో మ్యూజియంను నిర్మించనున్నారు. అలాగే దోహా యొక్క వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌లో ఉపయోగించని వాటిని ఆర్ట్ మిల్‌లో పునరుద్ధరించడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీన్ని 861,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com