కువైట్ లో రమదాన్ తొలిరోజు పెరిగిన నిత్యావసరాల ధరలు

- April 05, 2022 , by Maagulf
కువైట్ లో రమదాన్ తొలిరోజు పెరిగిన నిత్యావసరాల ధరలు

కువైట్: రమదాన్ మాసం ప్రారంభం కావడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. పవిత్ర మాసం తొలిరోజే నిత్యావసరాల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడటంతో కోఆపరేటివ్ సొసైటీలు, వాణిజ్య మార్కెట్లలో ఖర్జూరాలు, మాంసం, చికెన్ ధరలు పెరిగాయి. ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రమదాన్ మాసానికి ముందు ఉన్న వాటితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరగడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com