ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: ఎమ్మెల్సీ కవిత
- April 12, 2022
న్యూ ఢిల్లీ: 24 గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో తెలంగాణ రైతులతో కలిసి కొట్లాడుతామని కవిత తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్న కవిత, ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్ లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు పంటకు పెట్టిన కనీస ఖర్చు కూడా రావడం లేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస సానుభూతి కూడా లేదని కవిత మండిపడ్డారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత. రైతులందరికీ ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని కవిత పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!