తెలంగాణలో మరో రూ. 200 కోట్ల పెట్టుబడులు..
- April 12, 2022హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. బీఎస్ వీ గ్లోబల్ అనే సంస్థ హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తయారు చేసే యూనిట్ ను నెలకొల్పనుంది. నేడు ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.200 కోట్లతో సంస్థ ఆ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సంస్థ పెట్టుబడులతో హైదరాబాద్ కు వ్యాక్సిన్ హబ్ అనే పేరు సార్థకం అవుతుందని చెప్పారు. సంస్థ ఎండీ సంజీవ్ స్నావన్ గుల్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇటీవల కేటీఆర్ అమెరికాలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. క్వాల్కమ్, క్యాలవే, ఫిస్కర్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన సంగతి విదితమే. ఫిష్ఇన్ అనే సంస్థ మిడ్ మానేరులో చేపల ప్రాసెసింగ్ యూనిట్ ను పెడతామని హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!