'గటిమాన్ ఎక్స్ప్రెస్' రైలు తొలిసారిగా రేపు ప్రారంభం
- April 04, 2016
దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గటిమాన్ ఎక్స్ప్రెస్' రైలును తొలిసారిగా రేపు ప్రారంభిస్తున్నారు. ఢిల్లీ - ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన కార్యాలయంనుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 12 ఎసి కోచ్లున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమాటిక్ డోర్స్ తదితర పలు సౌకర్యాలు ఉన్నాయి.ఉదయం 8 గంటల 10 నిముషాలకు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో బయలుదేరి ఆగ్రాకు 9 గంటల 50 నిముషాలకు చేరుతుంది. ఆగ్రాలో తాజ్మహల్ మూసి ఉండే శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ రైలు ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడుస్తుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







