'గటిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలు తొలిసారిగా రేపు ప్రారంభం

- April 04, 2016 , by Maagulf
'గటిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలు తొలిసారిగా రేపు ప్రారంభం

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గటిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలును తొలిసారిగా రేపు ప్రారంభిస్తున్నారు. ఢిల్లీ - ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తన కార్యాలయంనుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభిస్తారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 12 ఎసి కోచ్‌లున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమాటిక్‌ డోర్స్‌ తదితర పలు సౌకర్యాలు ఉన్నాయి.ఉదయం 8 గంటల 10 నిముషాలకు నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి ఆగ్రాకు 9 గంటల 50 నిముషాలకు చేరుతుంది. ఆగ్రాలో తాజ్‌మహల్‌ మూసి ఉండే శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ రైలు ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com