ఇఫ్తార్ ఫిరంగి కాల్పులకు దుబాయ్ పోలీసుల ఏర్పాట్లు
- April 15, 2022
యూఏఈ: అల్ మన్ఖూల్లోని ఈద్ ప్రార్థనా మైదానంలో ఇఫ్తార్ ఫిరంగి పేలుళ్లను చూసేందుకు దుబాయ్ పోలీసులు నివాసితులను ఆహ్వానించారు. సాంప్రదాయ ఫిరంగిని ఏప్రిల్ 14, 15 తేదీలలో సూర్యాస్తమయం సమయంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 1960వ సంవత్సరం ప్రారంభం నుండి ఈ ప్రసిద్ధ సంప్రదాయం అమల్లో ఉన్నది. పవిత్ర రమదాన్ మాసంలో ప్రతి రోజూ ఇఫ్తార్ సమయంలో రెండు సార్లు ఫిరంగులను పేల్చుతారు. ఈ సంవత్సరం ఎమిరేట్లోని ఐదు ప్రదేశాలలో ఫిరంగులను దుబాయ్ పోలీసులు ఏర్పాటు చేశారు. అట్లాంటిస్ ది పామ్, బుర్జ్ ఖలీఫా, అల్ సీఫ్, సెంచరీ మాల్, దుబాయ్లోని అల్ వహెదా, ఎమిరేట్స్ కోఆపరేటివ్ సొసైటీ, హట్టా హిల్ పార్క్ ముందు ఫిరంగులను ఏర్పాటు చేశారు. ఎమిరేట్లోని 11 ప్రాంతాలలో మొబైల్ ఫిరంగులను ఏర్పాటు చేశారు. బిగ్ మస్జీదు సమీపంలో అల్ సత్వా; అల్ అన్బియా మస్జీదు సమీపంలో అల్ ఖౌజ్; అల్ నహ్దా నేషనల్ స్కూల్ సమీపంలో అల్ లిసైలీ; లహబాబ్ కమ్యూనిటీ పార్క్ 1 సమీపంలో లహబాబ్; షేక్ హమ్దాన్ మస్జీదు సమీపంలో అల్ అవీర్; అహ్మద్ అల్ హబ్బాయి మస్జీదు సమీపంలో అల్ ఖవానీజ్; అబ్దుల్ రహీమ్ మొహమ్మద్ క్తి మస్జీదు దగ్గర ముహైస్నా ప్రాంతాలలో మొబైల్ ఫిరంగులను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









