ఆది కొత్త చిత్రం ప్రారంభమయ్యింది
- June 11, 2015
సునీల్ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రాల్లో 'పూలరంగడు' ఒకటి. దానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. వాస్తవానికి ఆ చిత్రంలో ఆది హీరోగా నటించాల్సింది.కానీ, అప్పటికి ఆ కాంబినేషన్ కుదరలేదు. 'చుట్టాలబ్బాయ్' చిత్రంతో ఇప్పటికి కుదిరింది. రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో ఆరంభమైంది.ముహూర్తపు దృశ్యానికి రచయిత గోపీమోహన్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ''సాయికుమార్గారికి, ఆదికి ఈ కథ బాగా నచ్చింది. నా దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' తరహాలో ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదంతో సాగుతుంది. అయితే, ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది'' అన్నారు.అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న సినిమా అనీ, తన సినిమాకు థమన్ తొలిసారిగా పాటలిస్తున్నారనీ ఆది చెప్పారు. ఈ ఏడాది విడుదలయ్యే మంచి చిత్రాల్లో ఇది కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







